పామును మెడలో వేసుకుని ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి

  • పాము కాటుకు గురైన వ్యక్తి పామును మెడలో వేసుకుని ఆసుపత్రికి చేరుకున్న ఘటన
  • ఘటనతో ఆసుపత్రిలో రోగులు, వైద్యులు భయాందోళనకు గురయ్యారు
  • బీహార్‌లోని మీరాచాక్ గ్రామంలో ప్రకాశ్ మండల్‌పై రక్తపింజర పాము కాటు

 

బీహార్ రాష్ట్రం, భాగల్‌పూర్ జిల్లాలో పాము కాటుకు గురైన ప్రకాశ్ మండల్ మెడలో పామును వేసుకుని ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రిలో భయాందోళన నెలకొంది. ప్రమాదకరమైన రక్తపింజర పాము కాటు తర్వాత వైద్యులకు చూపేందుకు ఆ పామునే ఆసుపత్రికి తెచ్చారు. వైద్యులు సలహా మేరకు పామును సంచిలో బంధించారు, ప్రస్తుతం ప్రకాశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

 

బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో మీరాచాక్ గ్రామానికి చెందిన ప్రకాశ్ మండల్ అనే వ్యక్తి ప్రమాదకరమైన రక్తపింజర పాము కాటుకు గురయ్యాడు. తన ఎడమ చేతి బొటనవేలు కాటుకు గురైన ప్రకాశ్ పామును పట్టుకుని మెడలో వేసుకుని ఆసుపత్రికి చేరుకోవడంతో ఆసుపత్రిలోని రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

ఘటన జరిగిన వెంటనే ప్రకాశ్, జేఎల్‌ఎన్‌ఎం ఆస్పత్రికి చేరుకున్నాడు. మంచంపై పడుకోబెట్టిన తర్వాత కూడా అతను పామును వదలలేదు. వైద్యులు సూచన మేరకు సిబ్బంది ఆ పామును గోనె సంచిలో బంధించి రోగులకు భరోసా కల్పించారు. ప్రస్తుతం ప్రకాశ్‌కు చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ప్రతీక్ తెలిపారు.

Leave a Comment