ఘనంగా ప్రపంచ దృష్టి దినోత్సవ వేడుకలు పిల్లల కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

  • ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం
  • చిన్నపిల్లలలో దృష్టి సంరక్షణపై అవగాహన
  • కంటి ఆరోగ్యం కాపాడుకోవడంలో సెల్ఫోన్ అనర్ధాల ప్రభావం

: నిర్మల్ జిల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రపంచ దృష్టి దినోత్సవం పురస్కరించుకొని ఎల్వీ ప్రసాద్ ముధోల్, ఐఎమ్‌ఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి ఆరోగ్యం పరిరక్షణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 నిర్మల్ పట్టణంలో ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలలో కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్వీ ప్రసాద్ ముధోల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్మల్ శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ సురేష్, డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు హాజరయ్యారు. నేత్ర సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించిన వైద్యులు సెల్ఫోన్ వినియోగం వల్ల కంటి సమస్యలు పెరిగినట్లు హెచ్చరించారు. కంటి ఆరోగ్యం కాపాడుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో నినాదాలు, కంటి పరీక్షలతో నిర్మల్ జిల్లాను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు పిలుపునిచ్చారు.

Leave a Comment