బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

బాసర్: అక్టోబర్ 17, 2024

బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్‌లర్‌గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ క్యాంప్ ఆఫీస్‌కి చేరుకున్న గోవర్ధన్‌కు ట్రిపుల్ ఐటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మాజీ వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ నుండి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ, ట్రిపుల్ ఐటీకి ఇంచార్జి వీసీగా నియమితులైనందుకు గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ట్రిపుల్ ఐటీ సిబ్బంది భాస్కర్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment