మనోరంజని తెలుగు డైలీ
✒ ఒక ఫ్లాట్ రూ.500 కోట్లు!
గురుగ్రామ్:
దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస సముదాయాల దిశగా మరో అడుగు పడింది. గురుగ్రామ్లో DLF సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్ట్మెంట్స్లో ఒక్కో ఫ్లాట్ ధర రూ.100 కోట్ల వరకు ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు సన్స్టిక్ రియాల్టీ నిర్మించబోతున్న అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ ధరలు కనిష్ఠంగా రూ.100 కోట్లు, గరిష్ఠంగా రూ.500 కోట్లు ఉంటాయని సమాచారం.
ఎమాన్సే బ్రాండ్ కింద అత్యంత విలాసవంతంగా నిర్మించనున్న ఈ నివాస సముదాయాలు ముంబయి, దుబాయిలలో ఉండనున్నాయని కంపెనీ వెల్లడించింది.
ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా రూ.20,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సన్స్టిక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్ తెలిపారు.