రోడ్ల నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయల నిధుల మంజూరు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 15

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ తెలియజేసారు. బాసర మండలంలో ఓని గ్రామం నుండి బాసర వరకు రోడ్ నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు, నర్సాపూర్ మండలంలో అంబకంటి నుండి నందన్ వరకు రహదారి నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు, భైంసా మండలంలో వానల్ పాడ్ నుండి పెండ్ పెల్లి గ్రామానికి 1 కోటి రూపాయల నిధులు మంజూరైనట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు

Leave a Comment