HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా
ఖండిస్తున్నాం: ఈటల
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే
ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు,శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత
వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.