కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్. కృష్ణయ్య❓
హైదరాబాద్: సెప్టెంబర్ 25
మంగళవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, ఈరోజు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.
ఆర్. కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి, మల్లు రవి ఈ సమావేశం నిర్వహించినట్లు బీసీ సంఘం నాయకులు చెబుతున్నారు. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.