గోపాల్పేట్ నూతన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్కు ఘన సన్మానం
కామారెడ్డి, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి): డిసెంబర్ 15
కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్ నివాసంలో సోమవారం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ గౌడ్తో పాటు మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొని, సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని, పాలనలో పారదర్శకతతో పాటు సమిష్టి కృషి అవసరమని సూచించారు. గోపాల్పేట్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.