విలేకరుల ను దూషించిన కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిని శ్రీకాంత్.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
విలేకరులను దూషించిన కాంట్రాక్టర్ రామారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. బూరుగుపల్లి నుంచి దాంపూర్ వరకు రోడ్డు మరమ్మతుల కోసం టెండర్ వేసిన సదరు కాంట్రాక్టర్ ను విలేకరులు ప్రశ్నించినందుకు జర్నలిస్టులను కించపరుస్తూ దుర్భాషలాడారని మండిపడ్డారు. సదరు రోడ్డు కాంట్రాక్టర్ రామారావు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిని శ్రీకాంత్, పోగుల మల్లేష్, నూతి నాగరాజు, నంది శివ, కాసిపేట రవి, చందు, నరేష్, గజానంద్ పాల్గొన్నారు.