-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖ లో ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రము లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – భీమారం శాఖలో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పధకం పీఎంజేజేబి వై -436 రూపాయలతో ఇన్సూరెన్స్ లో పేరు నమోదు చేసుకున్న గుండెటి రాజుబాయి గ్రామం కిష్టంపేట ఇటివల అనారోగ్యం తో మరణించిగా నామిగా ఉన్నటువంటి ఆమె తల్లి గుండెటి మల్లక్క కు రెండు లక్షల చెక్ ను, భీమారం గ్రామానికి చెందిన ఆవుల ఓదెలు ఇటివల మరణించగా నామిని గా ఉన్నటువంటి అతని భార్య ఆవుల పద్మ కు రెండు లక్షల రూపాయల చెక్ ను ఎస్ బి ఐ – భీమారం శాఖ కార్యనిర్వహణధీకారి జి. సుబ్బా రెడ్డి , క్షేత్ర పర్యవేక్షణ అధీకారి వి.రామ చంద్ర సిబ్బంది కె.సతీష్ కుమార్ , పి.ఎస్.వై తెజస్వి , యు.రాజేష్ కుమార్ తో కలిసి అందజేసారు, వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పి ఎం ఎస్ బి వై, పి ఎం జె జె బి వై ఇన్సూరెన్స్ లలో తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలనీ, అపత్కాలంలో వారి కుటుంబానీకి ఆర్దిక సహాయంగా తోడుగా ఉపయోగపడుతుందనీ వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో అధీక సంఖ్యలో ఖాతాదారులు పాల్గోన్నారు.