భారత నగరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంటోంది: మేజర్ జనరల్ (రిటైర్డ్) అశోక్ హెచ్చరిక

భారత నగరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంటోంది: మేజర్ జనరల్ (రిటైర్డ్) అశోక్ హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ కుట్రలు మళ్లీ ఉధృతం

దిల్లీ–ఎన్సీఆర్ సహా భారత నగరాలు పాక్ లక్ష్యంగా

నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచన

మనోరంజని తెలుగు టైమ్స్ ఢిల్లీ ప్రతినిధి నవంబర్ 10

మాజీ మేజర్ జనరల్ అశోక్ కుమార్ (రిటైర్డ్) హెచ్చరిస్తూ, ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన పరాజయంతో పాకిస్థాన్ ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన నగరాలపై ఉగ్రవాద దాడుల పన్నాగం పన్నుతోందన్నారు. ఫరీదాబాద్‌లో ఇటీవల పట్టుబడిన పేలుడు పదార్థాలు, దేశంలో భయాన్ని వ్యాప్తి చేయాలనే పాక్ ప్రయత్నాన్ని వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.

“పాక్ ఉగ్రవాద గ్రూపులు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఈ కుట్రల్లో బంగ్లాదేశ్ ద్వారా సహకారం ఉండే అవకాశం కూడా ఉంది. భారత నిఘా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి,” అని మేజర్ జనరల్ అశోక్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment