ప్రతి 40 రోజులకు ఒక నౌక: నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠి
భారత నౌకాదళం ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని చేర్చుకుంటోందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి తెలిపారు. 2035 నాటికి 200కు పైగా నౌకల లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దేశీయ షిప్యార్డుల్లో 52 యుద్ధనౌకలు, సబ్మెరైన్లు నిర్మాణంలో ఉన్నాయి. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.