మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రం లోని కోదండ రామాలయంలో భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతాన్నిమంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో మంగళ గౌరీ వ్రతం నిర్వహించామని ఆలయ అర్చకులు తిరునగరి కన్నయ్య, ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మంగళ హారతులతో, పూజా సామాగ్రితో హాజరై అత్యంత భక్తిశ్రద్ధలతో మంగళ గౌరీ వ్రతం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ తో అలరించాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు.