ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుక.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 04
తెలంగాణ రాష్ట్రంలోని
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు కొనసాగుతున్నాయి.
మంగళ వారం రెండవరోజు ఉదయం వేదపండితులు చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో మంగళ వాయిద్యాల మధ్య వేదపండితుల మంత్రోత్సవాలతో నిత్యవిధి,చండీపారాయణ,సహస్రకలిశస్థాపన,చండీ హోమం,విగ్రహాల ధాన్యదివాసం చేసారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సారంగాపూర్ గ్రామ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేసారు.ఈ కార్యక్రంలో ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్,ఈఓ భూమయ్య, కాంట్రాక్టర్ లక్కడి జగన్ మోహన్ రెడ్డి,నాయకులు ఐర నాయనారెడ్డి,దశరథ రాజేశ్వర్, మాధవ్ రావు, ఉట్ల రాజేశ్వర్,భోల్లోజి నర్సయ్య,ఓ నారాయణ రెడ్డి,రాజేశ్వర్ రావు, మారుతి, మాల ధారణ స్వాములు,భక్త జనులు పాల్గొన్నారు.