వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు వివరాలు విడుదల
మనోరంజని ప్రతినిధి – వేములవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గత 36 రోజుల హుండీ లెక్కింపు పూర్తయింది. ఈ లెక్కింపులో మొత్తం రూ. 2 కోట్లు 19 లక్షలు 35 వేల 165 రూపాయలు (₹2,19,35,165) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
అదనంగా, మిశ్రమ బంగారం 124 గ్రాములు 500 మిల్లీగ్రాములు, అలాగే మిశ్రమ వెండి 10 కిలోలు 500 గ్రాములు స్వీకరించినట్లు తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయ హుండీ ఆదాయం నిరంతరం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.