పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యo

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యo

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యo

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని రబింద్రా ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థులచే స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అపరిశుభ్రమైన పరిసరాలతో వివిధ రకాల వ్యాధులకు గురి అవుతామని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, చైర్మన్ భీమ్రావ్ దేశాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment