కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – మానాల మోహన్ రెడ్డి .
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 16,2025.
బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ ,నర్సాపూర్, కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు .రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను తీసుకోవాలని సూచించారు . A గ్రేడ్ ధాన్యం రేటు 2389 B గ్రేడ్ కు 2369 ప్రభుత్వం మద్దతు ధరను అందిస్తుందని తెలిపారు సంచులు మరియు లారీ ల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య ,వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకెట రవి ,ఏఎంసీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ ,రాములు నాయక్ ,జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగేల ప్రవీణ్,కోనసముందర్ సొసైటీ మాజీ చైర్మన్ బాపురెడ్డి,గోపిడి లింగారెడ్డి ,నూకల బుచ్చి మల్లయ్య, కొమ్ముల రాజేందర్ ,భూమారెడ్డి గంగారెడ్డి ,పుప్పాల నర్సయ్య, సంజీవ్ ,గణేష్ ,రాకేష్ ,సామ మహేందర్ ,సామ భూమారెడ్డి ,చెంగల అశోక్ ,ఐకేపీ సీసీ లు పీరియా ,రవి ,పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ బాబూరావు ,కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.