వేములవాడ: రాజన్న సేవలో ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం, అర్చకులు ఆయనను అద్దాల మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో సందడిగా మారింది. ధర్మదర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు