*బీసీలకు 42% శాతం రిజర్వేషన్ జీవో జారీ!*
*మనోరంజని ప్రతినిధి*
హైదరాబాద్:సెప్టెంబర్ 27
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కస రత్తు వేగవంతం చేసింది ఈ దిశగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీసీ సంక్షేమ శాఖ జీవోను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది, డెడికేటెడ్ కమీషన్ సిఫార్సు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెంబర్ 9 ని విడుదల చేసింది..
రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో ఇంటింటి సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులనిర్వహిం చింది. దీని ఆధా రంగా రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 (46.25%), బీసీ ముస్లింలు 35,76,588 (10.08%), ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,05,929 (10.45%), ఓసీ ముస్లింలు 8,80,424 (2.48%ం), ఇతర ఓసీలు 44,21,115 (13.31%) ఉన్నట్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను అధ్యయనం చేసిన సదరు కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
బూసాని కమిషన్ నివేదిక ఆధారంగా విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేష న్ను 42 శాతానికి పెంచేం దుకు మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తరువాత అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆయా బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా అక్కడ పెండింగ్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గత ఆగస్టు లోనే మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది. తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తాజాగా తెలంగాణ సర్కారు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది.
పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఆ దిశగా రిజర్వే షన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ పెంపుపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు, పలువు రు బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు.