కుటుంబ విలువల పరిరక్షణకు హిందువులు నడుం బిగించాలి
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
కుటుంబ విలువల పరిరక్షణకు ప్రతి హిందువు నడుము బిగించాలని ఉప్పల రూపచారి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా ఆర్ ఎస్ ఎస్ భీమారం శాఖ ఆధ్వర్యంలో స్థానిక గుడ్ మార్నింగ్ స్కూల్ లో విజయదశమి ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథి గా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ వందేళ్లుగా రాజ్యాంగ బద్దంగా ఈ దేశ అభ్యున్నతి కొరకు పనిచేస్తుందని చెప్పారు. వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ నిర్మాణానికి కుటుంబమే ఆధారమని ఆయన వివరించారు.ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు ఆర్ ఎస్ ఎస్ చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ ఎస్ ఎస్ ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత/ విభాగ్/జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ ఉప్పల రూపచారి మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు, హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు, హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత,కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ,పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు