గంగేశ్వర్ మహారాజ్ కు స్వాగతం పలికిన నాయకులు

గంగేశ్వర్ మహారాజ్ కు స్వాగతం పలికిన నాయకులు

గంగేశ్వర్ మహారాజ్ కు స్వాగతం పలికిన నాయకులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 21

మండల కేంద్రమైన ముధోల్ కు ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిణ్వట్ తాలూకా మదనాపూర్కు చెందిన గంగేశ్వర్ మహరాజ్ పాదయాత్ర చేరుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీంతో పాదయాత్ర బృందానికి బంజారా సంఘం జిల్లా నాయకులు నరెందర్ రాథోడ్, మాజీ జెడ్పిటిసి లక్ష్మి నర్సగౌడ్, నాయకులు విశ్వనాథ్ పటేల్, భక్తులు, తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర కుబీర్ మండలం గాల్ సింగ్ నాయక్ తాండలోని జగదాంబ ఆలయం నుండి సేవలాల్ మహారాజ్ పాదుకపల్లకితో బాసర్ వరకు ఈ పాదయాత్రచేపట్టినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బస చేసి సోమవారం పాదయాత్ర బాసర కు చేరుకుంటుందని తెలిపారు. బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం గోదావరి నది జలాలను గాలిసింగ్ నాయక్ తండా లోని జగదంబా ఆలయానికి తీసుకెళ్లి దేవి నవరాత్రులలో భాగంగా ఘటాలను ప్రతిష్టించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గంగేశ్వర్ మహారాజ్ కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు

Join WhatsApp

Join Now

Leave a Comment