రేపట్నుంచి కొత్త చరిత్ర మొదలవుతోంది: మోదీ
దిల్లీ: రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతోందని, కొత్త చరిత్ర మొదలవుతోందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీ మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మంగళవారం నుంచి నూతన జీఎస్టీ శ్లాబ్ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్క్కు మరింత ఊతమిస్తాయన్నారు. ‘‘ దేశమంతా సంతోషపడే జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయి. వీటితో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత వృద్ధిరేటుకు మరింత ఊతమిస్తాయి’’ అని మోదీ అన్నారు.