పర్యావరణహిత మట్టి గణపతి ప్రతిష్టలో ఆదర్శం
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 27
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామ యువ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గత 10 సంవత్సరాలుగా పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతిని ప్రతిష్టిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2016 నుండి ఇప్పటివరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులకు భిన్నంగా, పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశ్యంతో వీరు మట్టి గణపతిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పి.ఓ.పి గణపతుల వల్ల పర్యావరణానికటి కలిగే నష్టాన్ని గ్రహించి మట్టి గణపతిని ప్రతిష్టించడానికి మొగ్గు చూపుతున్నామని తెలిపారు