📍 హైదరాబాద్ | ఫిబ్రవరి 11
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు.
🔹 ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రాహుల్ గాంధీ.
🔹 హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5:30 గంటలకు హనుమకొండకు రాక.
🔹 ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ సిద్ధం.
🔹 సాయంత్రం 6:15కి సుప్రభ హోటల్లో విశ్రాంతి, అనంతరం ముఖ్య నేతలతో భేటీ.
🔹 రాత్రి 7:30కి కాజీపేట నుండి రైలులో తమిళనాడు ప్రయాణం.
🔹 సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు హన్మకొండకు చేరుకునే అవకాశం.
🔹 రాహుల్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5:30కి హనుమకొండకు చేరుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాహుల్ గాంధీ హనుమకొండ చేరుకున్న అనంతరం, సాయంత్రం 6:15కు సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
హనుమకొండ పర్యటన ముగిసిన అనంతరం, రాత్రి 7:30కి రాహుల్ గాంధీ కాజీపేట రైల్వే స్టేషన్ నుండి రైలు ద్వారా తమిళనాడు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ పర్యటనలో ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.