- ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత కంటి పరీక్షా శిబిరం
- నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
- క్యాటరాక్ట్ ఉన్న వారికి ఉచిత కంటి శస్త్రచికిత్స
- మహబూబ్ నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో చికిత్స
- అంబులెన్స్ సదుపాయం అందుబాటులో
నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ సహకారంతో పాత కలెక్టరేట్ భవనంలోని గది నం. 102లో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఫిబ్రవరి 12 బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు.
ఈ శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించి, క్యాటరాక్ట్ ఉన్న వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సను మహబూబ్ నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో చేయనున్నారు. రోగుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
శిబిరంలో పాల్గొనాలనుకునే వారు:
- ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేసుకుని రిపోర్ట్ తెచ్చుకోవాలి.
- ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ తీసుకురావాలి.
- వ్యక్తిగత ఫోన్ నెంబర్ అందించాలి.
- వివరాల కోసం 9440876556, 7386940480 నెంబర్లను సంప్రదించవచ్చు.