లట్టుపల్లి గ్రామస్తుల కుష్టు వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ

లట్టుపల్లి గ్రామస్తులు కుష్టు వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
  • గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్టు వ్యాధి నియంత్రణపై అవగాహన
  • లట్టుపల్లి గ్రామస్తులకు వైద్యాధికారి డాక్టర్ నారాయణస్వామి ప్రతిజ్ఞ చేయింపు
  • కుష్టు లక్షణాలను గుర్తించి ప్రారంభ దశలోనే చికిత్స అవసరం
  • ఉచితంగా మందులు, ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్య శాఖ

 

గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని లట్టుపల్లి గ్రామంలో కుష్టు వ్యాధి నియంత్రణపై గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బి. నారాయణస్వామి కుష్టు లక్షణాలు, చికిత్స ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు, గాంధీ వర్ధంతి సందర్భంగా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో కుష్టు వ్యాధి నియంత్రణపై గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బి. నారాయణస్వామి గ్రామస్తులకు కుష్టు వ్యాధి లక్షణాలు, చికిత్స, వ్యాప్తిని అరికట్టే విధానాలను వివరించారు.

కుష్టు వ్యాధి లక్షణాలు:

  • స్పర్శ లేకుండా మచ్చలు ఏర్పడటం
  • కన్ను బొమ్మల వెంట్రుకలు రాలిపోవడం
  • మొహం నూనెపూసినట్లు మెరిసిపోవడం
  • కనురెప్ప మూసుకోలేకపోవడం

డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ, “కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. శారీరక అంగవైకల్యం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న, ఆరోగ్య కార్యకర్తలు బోజ్జమ్మ, అబ్దుల్ సలీం, గ్రామస్థులు చంద్ర గౌడ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment