రేపటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

రేపటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

రేపటినుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు!

మనోరంజని  ప్రతినిధి

న్యూ ఢిల్లీ :జనవరి 30
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించను న్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగు తుంది.

రేపు ఉదయం 11 గంటల కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించను న్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి.

బడ్జెట్ సమావేశాల నేప థ్యంలో ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనం లో అఖిల పక్ష భేటీ నిర్వహి స్తోంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కానున్నాయి.

ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, లోక్‌సభ డిప్యూటీ లీడర్, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్, రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురు గన్ హాజరు కానున్నారు.

ప్రతిపక్షం తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు, చర్చించాల్సిన అంశాలు పై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment