విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ: విద్యతో అభివృద్ధి సాధ్యం

Study Material Distribution Event in Bhainsa by Team Bhainsa Division
  • భైంసాలో విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ పంపిణీ.
  • బుద్ధ విహార్ లో ప్రవేశ పరీక్షల విద్యార్థులకు ప్రత్యేక సహాయం.
  • ప్రముఖ బౌద్ధ గురువు నాగవంశ్ అమరావతి చేతుల మీదుగా పంపిణీ.

Study Material Distribution Event in Bhainsa by Team Bhainsa Division

నిర్మల్ జిల్లా భైంసాలో బుద్ధ విహార్ లో టీం బైంసా డివిజన్ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువు నాగవంశ్ అమరావతి విద్యతో అభివృద్ధి ప్రాధాన్యతను వివరించారు. డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ జాడే, కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

 

భైంసా పట్టణంలోని బుద్ధ విహార్ లో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న దాదాపు 200 మంది విద్యార్థులకు టీం బైంసా డివిజన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బౌద్ధ గురువు నాగవంశ్ అమరావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గురువు మాట్లాడుతూ, “విద్యతోనే వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యార్థి దశ నుండే చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి” అని సూచించారు. విద్యకు అనుగుణంగా మార్పులు రావడానికి టీం బైంసా డివిజన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ జాడే, కన్వీనర్ ధర్మాజీ చందనే, ఉపాధ్యక్షులు ధర్మరాజు దగ్డే, అనురత్ గర్కె, సూర్య దాస్ మాహడే, గౌరవ అధ్యక్షులు రాజారాం దాసరి, బుద్ధ విహార్ కమిటీ సభ్యులు, మరియు స్థానిక యువకులు పాల్గొన్నారు. ఈ చర్యలు విద్యార్థుల అకడమిక్ ప్రగతికి మరింత తోడ్పడతాయని వారు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment