ధరణి పోర్టల్కు ఐదు రోజులు బ్రేక్..!!
ధరణి పోర్టల్కు ఐదు రోజులు బ్రేక్ పడనుంది. డేటాబేస్ వర్షన్ అప్గ్రేడ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు పోర్టల్ పని చేయదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ మధ్యలో ధరణి సేవలకు అంతరాయం కలుగుతున్నందుకు చింతిస్తున్నామని వెల్లడించింది. ధరణి పోర్టల్లో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. వాటిని అప్ డేట్ చేసేందుకే పోర్టల్ సేవలకు ఐదు రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది