రాష్ట్రస్థాయి పోటీలకు అభిషేకం ఎంపిక




ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్ అండర్ -17 బాల-బాలికల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి అభిషేక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికావడం పట్ల ప్రధానోపాధ్యాయులు, పిడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. రేపు హైదరాబాద్లో జరిగే రెస్లింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.