ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మార్కట్లో పత్తి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కుభీర్ మండల కేంద్రంలోని సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే రైతంగానికి మద్దతు ధరలు పెరిగాయి అన్నారు. రైతులకు ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. 8 నుండి 12 తేమ శాతం ఉంటే క్వింటాలుకు 7521 రూపాయల ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ మార్కెట్ లో ధర తక్కువ ఉన్న నేపథ్యంలో రైతులకు ధర రావాలన్న ఉద్దేశ్యంతో సిసిఐ కొనుగోళ్లపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
