ఎమ్మెల్సీ ఓటర్ నమోదు దరఖాస్తు చేసుకోవాలి
మండల ఇంచార్జీ కదం సంతోష్ పటేల్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
త్వరలో జరగబోయే ఎమ్మె ల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్సీ ఓటు హ క్కు నమోదును అర్హులైన ఉపాధ్యా య, పట్టభద్రులు దరఖాస్తులు చేసు కోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల ముధోల్ మండల ఇంచార్జ్ కదం సంతోష్ పటేల్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇప్పటివరకు ముధోల్ మండలంలో సుమారు 250కి పైగా ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేసినట్లు తెలిపారు. అర్హులైన అందరూ ఓటు నమోదును చేసుకోవాలని అన్నారు. ఈనెల ఆరో తేదీ గడువు కావడంతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా తిరిగి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నా రు ఎమ్మెల్సీ ఓటు ఒక కోసం డిగ్రీ మెమో, ప్రొవిజినల్ సర్టిఫికేట్, ఆధార్కా ర్డు, ఫైల్ ఫోటో జిరాక్స్ అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 903275 0536 నెంబర్కు సంప్రదించాలన్నారు.