వ్యాపారస్తులు లైసెన్స్ ను తీసుకోవాలి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
విధిగా లైసెన్స్ ను గ్రామపంచాయతీ ద్వారా తీసుకోవాలని ఈఓ ప్రసాద్ గౌడ్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లో వ్యాపారస్తులకు లైసెన్స్ లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేని వారు లైసెన్స్ ను తీసుకోవడంతో పాటు లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేని వారు చేసుకోవాలని సూచించడము జరిగింది అన్నారు. వ్యాపారస్తులు ఆన్లైన్లో రుసుమును చెల్లించాలన్నారు.ప్రతి షాప్ కు వెళ్లి లైసెన్స్ లైసెన్స్ అవశ్యకత వివరించారు. లైసెన్స్ తీసుకోవడం వల్ల వ్యాపారస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మాధవ్, ప్రవీణ్ తదితరులున్నారు.