మూసీ నది పునరుజ్జీవనానికి హన్ నది మోడల్
- సియోల్ లో మంత్రుల బృందం పర్యటన
- చుంగేచాన్ తీరాన్ని పరిశీలన
- హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్
మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం తెలంగాణ మంత్రులు దక్షిణ కొరియాలోని సీయోల్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో చుంగేచాన్ తీరాన్ని మరియు హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ను అధ్యయనం చేశారు. సియోల్లో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు హన్ నది కీలకమైనది.
తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు దక్షిణ కొరియాలోని సీయోల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం సియోల్ లోని చుంగేచాన్ తీరాన్ని పరిశీలించారు.
మునుపు మురికి కూపంలా ఉన్న చుంగేచాన్ ఉప నది ఇప్పుడు శుభ్రమైన నీరుతో ప్రవహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మురికి, కాలుష్యానికి గురైన మూసీని పునరుజ్జీవించాలనే దృష్టితో ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తోంది.
ఈ రోజు, తెలంగాణ ప్రతినిధుల బృందం హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ను సందర్శించనుంది. 494 కిలోమీటర్లు పొడవు కలిగి, 40 కిలోమీటర్లు సియోల్ నగరంలో ప్రవహిస్తున్న హన్ నది, ప్రస్తుతానికి సియోల్కు ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా మారింది.