మసీదుపై కాల్పులు.. 50 మంది మృతి
నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా పట్టణంలో మసీదుపై కాల్పులు జరపటంతో 50 మంది మృతిచెందారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగులు ఈ దాడి చేశారని ప్రజాప్రతినిధి అమీను ఇబ్రహీం తెలిపారు. కొన్ని గ్రామాలపై కూడా దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి వుందన్నారు