కాంగోలో చర్చిపై దాడి.. 38 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఓ కేథలిక్ చర్చిలో ఐఎస్ అనుబంధ ఆర్డీఎఫ్ ఉగ్రవాదులు తుపాకులు, కత్తులతో చర్చిలోకి దూసుకెళ్లి కాల్పులు జరిపి 38 మందిని హత్య చేశారు. అనంతరం కొందరిని తమ వెంట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. చర్చికి సమీపంలోని ఇల్లు తగలబెట్టారు. మృతదేహాలు ఇప్పటికీ చర్చిలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు