ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి: గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా

ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి: గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా
  • గిరిజన గౌరవ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రసంగం
  • గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు పథకాలు అమలు
  • 33 ఆవాసాల అభివృద్ధి కోసం జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్

ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి: గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా

నిర్మల్ జిల్లాలో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గిరిజన బాలికల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి: గిరిజన గౌరవ దినోత్సవం ఘనంగా

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గిరిజన గౌరవ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకం కింద మొదటి దశలో ఎంపికైన 33 ఆవాసాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జీవనోపాధి, త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, నాణ్యమైన విద్య తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, పథకాల అమలుకు బ్లాక్ మరియు మండల స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మరియు జిల్లా ప్రత్యేక అధికారి చందన పథకం లక్ష్యాలు, అమలు తీరును వివరించారు.

ఈ వేడుకలో గిరిజన బాలికలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ గ్రామాల గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment