1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క
తెలంగాణ : రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలి. ఆశ్రమ పాఠశాలల కోసం 1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి. ఆదివాసీలు, పీవీటీజీల కోసం హైదరాబాద్లో ప్రత్యేక IAS స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని అధికారులకు సూచించారు