సమాజ సేవలో భాగస్వాములు కావాలి

సమాజ సేవలో భాగస్వాములు కావాలి

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

మంచిర్యాల అక్టోబర్ 14

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని
మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు బొలిశెట్టి రాజన్న రాజన్న, పోలంపల్లి శ్రీనివాస్ సూచించారు. దండేపల్లి లో సోమవారం జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత, విద్యార్థులకు చేయూత నివ్వాలన్నారు. అనంతరం ఇటీవల పదోన్నతులు పొందిన డిగ్రీ లెక్చరర్ మొరుపుటాల తిరుపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మొరుపుటాల ప్రేమ్ కుమార్, జూనియర్ లెక్చరర్ తోట భీమయ్య, తెలుగు ఉపాధ్యాయుడు బక్క శెట్టి వెంకటేష్, హెడ్ కానిస్టేబులు నాసాని రవి, కుంచె గణేష్ లను సన్మానించారు.. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బొలిశెట్టి బుచ్చన్న, గౌరవాధ్యక్షుడు అన్నం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అప్పాల మనోహర్, కోశాధికారి కుంచె కిషన్, గుర్రం గంగన్న, గాండ్ల సత్యనారాయణ, కొండు జనార్ధన్ పాల్గొన్నారు.,

Join WhatsApp

Join Now

Leave a Comment