ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి ..
సప్తాహ ముగింపులో పాల్గొన్న యోగేష్ మహారాజ్
మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 19 :-

నిర్మల్ జిల్లా తానుర్ మండలం లోని బెంబర్ గ్రామంలో గత వారం రోజులుగా అఖండ హరినామ సప్తాహ కొనసాగుతోంది. సప్తాహ ముగింపు కార్యక్రమంలో కీర్తన్ యోగేష్ మాహారాజ్ ఆధ్వర్యంలో ప్రవచనం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గం లో నడవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత, ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో పయనం సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ప్రసాదం గావించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన భజన మండలి,ప్రముఖులు పాల్గొన్నారు