- నాయక నిమజ్జనం సందర్భంగా వైన్ షాపులు బంద్
- 17, 18 సెప్టెంబర్కు ఆదేశాలు
- క్లబ్బులు, స్టార్ హోటల్స్ బార్లకు మినహాయింపు
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం సందర్భంగా 17, 18 సెప్టెంబర్ తేదీల్లో నగరంలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. క్లబ్బులు, స్టార్ హోటల్స్లోని బార్లకు మినహాయింపు ఇవ్వబడింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ప్రకటించారు. అయితే, క్లబ్బులు మరియు స్టార్ హోటల్స్లోని బార్లకు మినహాయింపు ఉందని తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.