భయంకర రోడ్డు ప్రమాదంలో వాసవి టీచర్ రాజ్కుమార్ మృతి
భైంసా పట్టణంలో విషాదం –
నందనం ఎక్స్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం
మనోరంజని తెలుగు టైమ్స్, నర్సాపూర్ ప్రతినిధి – నవంబర్ 08:
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని నందనం ఎక్స్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని కూల్చివేసింది. భైంసా వాసవి హైస్కూల్లో సోషల్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు రాజ్కుమార్ (బ్రాహ్మణ) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పేర్కొన్నారు. ప్రతిరోజు నిర్మల్ నుండి భైంసాకు మోటార్ సైకిల్పై ప్రయాణం చేసే రాజ్కుమార్, సాయంత్రం పనికి వెళ్తుండగా ఎదురుగా వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో నర్సాపూర్ జీ గ్రామానికి చెందిన మరో టీచర్ భూమారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతుడు రాజ్కుమార్ కుటుంబం మంజులపూర్లో నివసిస్తోంది. ఈ దుర్ఘటనతో భైంసా పట్టణం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
స్థానికులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.