దుర్గామాతను దర్శించి తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

– బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

Alt Name: దుర్గామాత దర్శనం, తీజ్ పండుగ, బోథ్ ఎమ్మెల్యే

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ఆదిలాబాద్ జిల్లా అక్టోబర్ 11

నెరడిగొండ మండలంలోని బుగ్గరాం బి గ్రామంలో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బంజారా పండుగ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాధవ్‌ను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలందరూ భక్తి మార్గంలో నడవాలని, ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment