కుబీర్ గ్రామానికి విచ్చేసిన సినీ నటుడు, కళాకారునికి ఘనంగా సన్మానం
కుబీర్ గ్రామానికి విచ్చేసిన సినీ నటుడు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్, రంగస్థలం నటుడు బాపనపల్లి వెంకటస్వామి “””రావణబ్రహ్మ”””ఏకపాత్రాభినయం అద్భుతంగా ప్రదర్శించడంతో ముగ్ధులై కుబీర్ మండల మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్లు మాట్లాడుతూ ఇంతటి కళాకారులు మా గ్రామానికి విచ్చేయడం చాలా హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి, చిక్లి రాజన్న రాజన్న పలువురు గ్రామస్తులు పాల్గొని కళాకారునికి అభినందించారు.