జిల్లాలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను వెల్లడించాలని ఆదేశించారు.
గ్రామ సభలకు హాజరయ్యే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా నిర్ణీత సమయంలో సభలను ముగించాలని కలెక్టర్ సూచనలు చేశారు. ప్రజలకు పథకాల అమలు తీరును తెలియజేయడం ద్వారా కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు.
అధికారులు సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.








