- డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మర్యాద పూర్వకంగా సీనియర్ న్యాయవాది ప్రశాంత్ కుమార్ ను కలిసారు
- మానవ హక్కులు, బాధ్యతలు, కోర్టుల ప్రభావంపై సుదీర్ఘ చర్చ
- ప్రశాంత్ కుమార్ కు ఎన్ హెచ్ ఆర్ సి లో చేరేందుకు ఆహ్వానం
హైదరాబాద్ : సెప్టెంబర్ 19
హైదరాబాద్ సిటీలో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ కుమార్ ను ఎన్.హెచ్.ఆర్.సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. మానవ హక్కులు, బాధ్యతలు, మరియు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కోర్టుల ప్రభావం గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రశాంత్ కుమార్ ను ఎన్ హెచ్ ఆర్ సి లోకి ఆహ్వానించారు.
హైదరాబాద్ సిటీలో ఇంటర్నేషనల్ స్థాయిలో మానవ హక్కులపై అనేక దేశాల్లో పని చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ కుమార్ ను ఎన్.హెచ్.ఆర్.సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో మానవ హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కోర్టుల ప్రభావం వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కోర్టుల ప్రభావం, బాధ్యతలు, మరియు మహిళా రక్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చనీయాంశాలుగా నిలిచాయి. డాక్టర్ భద్రయ్య ఎన్ హెచ్ ఆర్ సి లోకి ప్రశాంత్ కుమార్ ను ఆహ్వానించారు, వారి అనుభవం కమిటీకి కీలకమని పేర్కొన్నారు.