తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు అంకితభావంతో పనిచేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. తానూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ మేరకు పలు సూచనలు చేశారు.
గ్రామాల అభివృద్ధిని ధ్యేయంగా సర్పంచ్లు పనిచేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం తానూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సర్పంచ్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్లు లేవనెత్తిన సమస్యలను 45 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లకు సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో అధికారులు తమ శాఖల వారీగా ప్రగతి నివేదికలను సమర్పించారు.
సర్పంచ్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు ఎమ్మెల్యే సమక్షంలో వివరించారు. అంతకుముందు, ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.











