Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 04
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం సమీపంలో రూ.90 లక్షల కేంద్ర నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనుల వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం సమీపంలో శనివారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూ.90 లక్షల కేంద్రం నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ సమీపంలో రోడ్డు, డ్రైనేజి నిర్మాణంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తొలగుతాయని అన్నారు.
త్వరగా పనులు పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండు సాయన్న, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మంతెన గంగారెడ్డి, వడ్డే రాజేందర్ రెడ్డి, పతని నర్సయ్య, మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ నరేష్, కోరిపెళ్ళి రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ శేఖర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.












