- కుబీర్ మండల విద్యాధికారి అవినీతి, నిర్లక్ష్యం ఆరోపణలు.
- పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల చదువుకు ఆటంకం.
- లైంగిక వేధింపుల కేసులో మండల విద్యాధికారి తీరుపై విమర్శలు.
భైంసా : సెప్టెంబర్ 20
: కుబీర్ మండల విద్యాధికారిపై అవినీతి, నిర్లక్ష్యం ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తాయి. చాత్ర యువ సంఘర్ష సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కార్ అరవింద్ అభిప్రాయపడి, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆరోపించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణలో లోపాలు, బిట్ కాయిన్ వ్యాపారంలో పాల్గొన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కుబీర్ మండల విద్యాధికారిపై అవినీతి, నిర్లక్ష్యం ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. చాత్ర యువ సంఘర్ష సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కార్ అరవింద్ మాట్లాడుతూ, మండలంలోని పాఠశాలల్లో చదువుతున్న పేద మరియు బడుగు వర్గాల విద్యార్థుల భవిష్యత్తు, ఈ విద్యాధికారి నిర్లక్ష్యంతో అంధకారంలోకి నెట్టబడుతోందని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగినప్పటికీ, ఉపాధ్యాయులను రిలీవ్ చేయడం, కొత్తగా ఎవరు రాకపోవడం వల్ల పాఠశాలలు ఉపాధ్యాయుల్లేకుండా ఉన్నాయి. మండల విద్యాధికారి అవినీతికి పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్లు సమాచారం ఉందని ఆయన ఆరోపించారు.
గతంలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినా, ఆ ఉపాధ్యాయుని కాపాడాలని మండల విద్యాధికారి చర్యలు తీసుకున్న తీరు దారుణమని ఆయన విమర్శించారు.
తదుపరి, బిట్ కాయిన్ గొలుసు వ్యాపారంలో పాల్గొన్న కొంతమంది ఉపాధ్యాయుల పాఠశాలలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్ళడం పై మండల విద్యాధికారి కనీస పర్యవేక్షణ చేయకపోవడం అనుమానాస్పదంగా ఉందన్నారు.
చిత్రవిచిత్ర అవినీతి, నిర్లక్ష్య తీరు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ మరియు జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు జరిపి, ఈ విద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని శీతాల్కార్ అరవింద్ డిమాండ్ చేశారు.