ముధోల్ మండల విద్యాధికారికి సన్మానం

 

ముధోల్ మండల విద్యాధికారికి సన్మానం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్ : సెప్టెంబర్ 27

నిర్మల్ జిల్లా ముధోల్ మండల విద్యాధికారిగా ఇటీవల రమణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా, జిల్లా పరిషత్ ఉన్నతబాలికల పాఠశాలను సందర్శించిన ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు కవిత, నీరజ, స్వర్ణలత, పర్వీన్, కవిత, గంగాధర్, శ్రీధర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Leave a Comment